20రోజుల పాటు లాక్‌డౌన్ విధించండి


దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి దేశంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలనే డిమాండ్ వినిపించింది. దీనిపై స్పందించిన కేంద్రం మరోసారి లాక్‌డౌన్ ఉండదని స్పష్టతనిచ్చింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే ఈ ప్రకటన చేశారు. అయితే పలు రాష్ట్ర ప్రభ్బుత్వాలు కరోనా విజృంభణ అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్పెషల్ లాక్‌డౌన్ విధిస్తోంది.

ప్రస్తుతం తమిళనాడు, ఏపీలలో కొన్ని ప్రాంత్రాల్లో పూర్థిస్థాయి లాక్‌డౌన్ అమలు అవుతోంది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఐదు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఐదు ప్రాంతాల్లో మాత్రమే లాక్‌డౌన్ సరిపోదు. కర్ణాటక మొత్తం 20రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి సూచించారు. లేదంటే.. బెంగళూరు మరో బ్రిజిల్ అవుతుందని ఆయన అన్నారు. కార్మికులకి నిత్యావసర సరుకులతో పాటు.. ఒక్కోక్కరి చొప్పున రూ. 5వేలు ఇవ్వాలని కుమార స్వామి డిమాండ్ చేశారు.