ఇకపై రూ.5వేలు మాత్రమే విత్ డ్రా


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలిసింది. ఏటీఎం ఛార్జీలను మరింత పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎం ట్రాన్సాక్షన్ లో రూ.5వేలు మాత్రమే విత్ డ్రాకు అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అంతకు మించి డ్రా చేస్తే అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక సంస్కరణలు ప్రతిపాదించింది.

కమిటీ చేసిన ప్రతిపాదనలోని విషయాలు ఇలా ఉన్నాయి. ఏటీఎంలలో జరిపే అన్ని లావాదేవీలపై ఇంటర్ ఛేంజ్ ఛార్జీలను పెంచాలని సూచించింది. దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలకు ఇది వర్తించేలా చేయాలని ఆర్బీఐని కోరింది. 10 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏటీఎం ఛార్జీలు పెంచాలని నివేదికలో పేర్కొంది. కమిటీ నివేదిక అమలుకే ఆర్భీఐ కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. ఇప్పటికే కరోనాతో అష్టకష్టాలు పడుతున్న ప్రజలకి మరింత భారం పడనుంది.