గుడ్ న్యూస్ : కరోనాకు పతాంజలి మందు


ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా మహమ్మారికి మందులు వస్తున్నాయ్. ఇప్పటికే కరోనాకు రెండు మందులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి కరోనాకి మందుని విడుదల చేసింది. హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మందును ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాందేవ్‌ మాట్లాడుతూ.. ‘కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చు. ఈ మందుతో మూడు రోజుల పరిశీలనలో 69 శాతం మందికి నెగిటివ్‌ రావడం శుభసూచకం. అలాగే 7 రోజుల్లో వంద శాతం మంది కోలుకున్నారు. మందును తీసుకురావడంలో మా శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయం’ అని రాందేవ్‌ పేర్కొన్నారు. అయితే ఈ మందు ధర ఎంత ? అన్నది మాత్రం తెలిపలేదు.