బ్రేకింగ్ : హైదరాబాద్ లో కరోనా టెస్టులకి బ్రేక్

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. అయితే హైదరాబాద్ లో కరోనా టెస్టులకి బ్రేక్ పడింది. ఇప్పటికే సేకరించిన శాంపిళ్ల టెస్టింగ్ ప్రక్రియ పూర్తికాని కారణంగా నేడు, రేపు పరీక్షలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఇక బుధవారం తెలంగాణలో 891 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇందులో 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 4,361 మంది కోలుకుని డిస్చార్జ్‌ అయ్యారు. బుధవారం కరోనాతో ఐదురుగురు మరణించడంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 225కి చేరింది.