ఆరోవిడత హరితహారం ప్రారంభం

తెలంగాణలో ఆరోవిడత హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడే 630 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్టు పార్కును సీఎం ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం 2015 జులై 3న రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇప్పటివరకు ఐదు విడతలు పూర్తయ్యాయి. ఆకుపచ్చ తెలంగాణ సాధించడం, రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడం, రాష్ట్రాన్ని పర్యావరణహితంగా చేయడం హరితహారం లక్ష్యం.