కశ్మీర్’లో ఉగ్రదాడి.. పరిస్థితి ఉద్రిక్తం !

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంతనాగ్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. సీఆర్పీఎఫ్ జవాన్ తో సహా బాలుడు మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లతో పాటు పలువురు స్థానికులకి గాయపడినట్టు సమాచారమ్. దీంతో బార్డర్ లో టెన్షన్ వాతావారణం నెలకొంది.

ఇంకా కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో చుట్టు ప్రక్కన ఉన్న గ్రామాల ప్రజలని దూరంగా తరలించేందుకు సైన్యం ఏర్పాట్లు చేస్తోంది. సీఆర్పీఎఫ్ జవాన్లకి, ఉగ్రవాదులకి మధ్య హోరాహోరిగా కాల్పులు జరుగుతున్నాయి. కరోనా ఫీవర్ లో ఉన్న భారత్ లోకి ఉగ్రవాదులని తరలించేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నమే ఇదని తెలుస్తోంది.