అచ్చెన్నాయుడుకి మరో 10రోజుల రిమాండ్

ఈఎస్‌ఐ కేసులో మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు రిమాండ్‌ను అనిశా న్యాయస్థానం పొడిగించింది. వచ్చే నెల 10 వరకు అచ్చెన్నాయుడు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గతంలో అచ్చెన్నాయుడుకి విధించిన 14రోజుల రిమాండ్ నేటితో ముగిసిన నేపథ్యంలో.. మరో 10రోజుల పాటు రిమాండ్ పొడిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో గత మూడ్రోజులుగా అచ్చెన్నాయుడు విచారిస్తున్నారు అనిశా అధికారులు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోనే విచారిస్తున్నారు. మొదటిరోజు మూడు గంటలు, రెండో రోజు ఐదు గంటలు, మూడో రోజు రెండున్నర గంటల పాటు అచ్చెన్నాయుడుని విచారించారు. మొత్తంగా మూడు రోజుల్లో 10.30 గంటలపాటు విచారించారు.