‘పుష్ప’ నుంచే కటింగ్స్ మొదలు

కరోనాకి ముందు కరోనా తర్వాత అన్నట్టుగా సినీ పరిశ్రమలో మార్పులు రాబోఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో మునుపటిలా సినిమా బడ్జెట్, నటీనటుల పారితోషికాలు ఉండకపోవచ్చని చెప్పుకొంటున్నారు. ఇప్పటికే చాలామంది నటీనటులు పరిస్థితులని అర్థం చేసుకొని రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారని తెలుస్తోంది. అయితే టాలీవుడ్ లో కాస్ట్ కటింగ్ ‘పుష్ప’ సినిమా నుంచి మొదలుకానున్నాయని చెప్పుకొంటున్నారు.

సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ అనుకున్నారు. గ్రాండ్ గా తీసుకురావాలని ప్లాన్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో తెరకెక్కించనున్నారు. అయితే కరోనా ప్రభావంతో పుష్ప స్క్రిప్టులో స్వల్ప మార్పులు చేస్తున్నారు. బడ్జెట్ ని తగ్గిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బన్నీకి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ లో బ్యూటీ దిశాపటానీ మెరవనుందని సమాచారమ్.