కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన రఘు రామకృష్ణ రాజు

ఢిల్లీ పర్యటనలో  ఉన్న నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు కేంద్రం హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. వైకాపా నేతల నుంచి తనకు ముప్పు పొంచి ఉన్నందున రక్షణ కల్పించాలని కోరారు. ఇక ఢిల్లీ టూర్ పై మీడియాతో మాట్లాడిన రషు రామకృష్ణ రాజు పార్టీని, పార్టీ అధ్యక్షుడిని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, ఇకపై కూడా వ్యతిరేకించనని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తనని వివరించారు.

విజయసాయిరెడ్డి ఇచ్చిన షోకాజ్‌ నోటీసుపై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టు చెప్పారు. షోకాజ్‌ నోటీసుకు సంబంధించిన నిబంధనలు తెలుసుకునేందుకు నిన్న ఎన్నికల కమిషన్‌ అధికారులను కలిసినట్టు తెలిపారు. సీఎంను కలిసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.