దేశంలో కొత్తగా 19,459 కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.  గడిచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 19,459 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా మరో 380మంది చనిపోయారు. దీంతో సోమవారం నాటికి దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 5,48,318కి చేరింది.

మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 3,21,722మంది కోలుకోగా మరో 2,10,120మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ లలో వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.