బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా

ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హార్యానా బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సుధా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన పర్సనల్ అసిస్టెంట్ అరుణ్ గులాటి మీడియాకు తెలిపారు. కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్‌ ఎమ్మెల్యే సుభాష్ సుధా కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆయనను గుర్‌గావ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. టెస్టుల్లో ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ముగ్గురు, ఏపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. మంత్రి హరీష్ రావు, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు.. కరోనా వారియస్ కూడా కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.