బ్రేకింగ్ : కరోనాతో క్రికెటర్ మృతి

కరోనా కాటుకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు బలవుతున్నారు. తాజాగా కరోనాతో ప్రముఖ క్రికెటర్, ఢిల్లీ అండర్ -23 సహాయక సిబ్బందిగా సేవలందించిన సంజయ్ దోబల్ (53)కన్నుమూశారు.

వారంరోజుల క్రితం సంజయ్ దోబల్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మహదూర్‌గఢ్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యపరిస్థితి రోజురోజుకి దిగజారింది. మరింత మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం ఆయనను ద్వారకా దవాఖానకు మార్చారు. అక్కడ ప్లాస్మా చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ ఉదయం దోబల్ తుదిశ్వాస విడిచారు.

సంజయ్‌ దోబల్.. ఢిల్లీ క్రికెటర్లలో వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, మిథున్ మన్హాస్‌తో కలిసి ఆడారు. అతను సొనెట్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడి కోచ్‌ తారక్ సిన్హా శిక్షణలో రాటుదేలారు. దోబల్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సిద్ధాంత్.. రాజస్థాన్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతుండగా.. చిన్న కుమారుడు ఏకాన్ష్‌ ఢిల్లీ అండర్ -23 జట్టులో అరంగేట్రం చేశాడు.