నెటిజన్స్ డిమాండ్ : అక్షయ్, సోనూసూద్’లకి భారతరత్న ఇవ్వాలి


కరోనా మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో సినీ తారలందరూ తమవంతు సాయం చేశారు. అయితే, బాలీవుడ్‌ నటులు అక్షయ్‌కుమార్‌, సోనూసూద్‌లు విరాళాలు ఇవ్వడమే కాకుండా ఎంతోమంది వలస కార్మికులకు సాయం చేశారు. ప్రధాని సహాయనిధికి అక్షయ్‌ భారీగా రూ.25కోట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఇక లాక్‌డౌన్‌ కాలంలో నటుడు సోనూసూద్‌ ఎంతోమంది వలస కార్మికులకు తనవంతు సాయం అందజేశారు. సొంతూళ్లకు చేరే మార్గం లేక బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీసిన వారికి తన ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేశాడు. మరికొందరికి రైలు టికెట్లు ఇచ్చి పంపాడు. ఈ నేపథ్యంలో వీరికి భారతరత్న ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది.