టాలీవుడ్ నిర్మాతపై పోలీస్ కేసు

టాలీవుడ్ నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ బంజారాహీల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇంటికి అద్దెకు సంబంధించిన వ్యవహారంలో నవ్వాడ శోభారాణి అనే మహిళ ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మినిస్టర్‌ క్వార్టర్స్‌ ఎదురుగా నవ్వాడ శోభారాణికి సొంతిల్లు ఉంది. దానిని నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ కు అద్దె ఇచ్చింది. ఆ ఇంటిలో తెలంగాణ ఫిలిం కల్చరల్‌ సెంటర్‌(టీఎఫ్‌సీసీ) ఏర్పాటుని ఏర్పాటు చేశారు. నెలకి 4.5లక్షల అద్దె. 40లక్షల అడ్వాన్స్ గా ఒప్పందం కుదుర్చుకున్నారు.

అయితే అడ్వాన్స్ గా నిర్మాత 30లక్షలు మాత్రమే ఇచ్చారట. అంతేకాదు.. ప్రతి నెలా అద్దె డబ్బులు ఇచ్చే విషయంలో  ఇబ్బందులకి గురిచేశాడు. వేధించేవాడు. ఇటీవల తాను అద్దె చెల్లించలేనని ఇంటితాళం ఇచ్చేసి వెళ్లారు. ఆ తర్వాత నిర్మాత  రామకృష్ణ గౌడ్ కొడుకు వచ్చి బెదిరింపులకి ప్లాల్పడ్డాడని శోభారాణి తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.