తెలంగాణలో ఒక్కరోజే 1018 కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1018 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజులో ఈ రేంజ్ లో కొత్త కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,357కి చేరాయి.

రాష్ట్రంలో కరోనాతో కొత్తగా మరో ఏడుగురు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 267కి పెరిగింది. 788 మంది కోలుకోవడంతో డిశ్చార్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 8082కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9008మంది చికిత్స పొందుతున్నారు. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 881 కేసులు నమోదయ్యాయ్. మేడ్చల్‌ జిల్లాలో 36, రంగారెడ్డి జిల్లాలో 33, మిబూబ్‌నగర్‌ జిల్లాలో 10 చొప్పున నమోదయ్యాయి.