ఏపీలో కొత్తగా 657 కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 657 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,813కి చేరింది.

ఇక ఏపీలో గడిచిన 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య 193కి చేరింది.  ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 7,033 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 5,587 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.