ఇద్దరు ఏపీ మంత్రులు రాజీనామా

ఏపీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ పదవులకి రాజీనామా చేశారు. వీరిద్దరు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులకి, మంత్రి పదవులకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలని సీఎం జగన్ ని అందజేశారు.

ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘పార్లమెంట్‌కు వెళ్లాలన్నది తన చిరకాల కోరిక. సీఎం జగన్‌ చొరవతో అది నెరవేరిందన్నారు. ఈ సందర్భంగా జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఏపీలో ఖాళీ అయిన రెండు మంత్రి పదవులని ఎవరికి కేటాయిస్తారు ? అన్నది ఆసక్తిగా మారింది.