పాపం అంటే.. ఫైర్ అయ్యింది !

నటి వనితా జీవితంలో పెళ్లిళ్లు క‌లిసి రాలేదు. రెండు పెళ్లిళ్లు వివిధ కార‌ణాల‌తో విడాకుల‌కు దారి తీశాయి. ఇటీవలే పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని ఆమె మూడో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. అయితే తనకు విడాకులు ఇవ్వకుండానే వ‌నిత‌ను  పెళ్లి చేసుకున్నాడని   పీటర్‌ మొదటి భార్య ఎలిజబెత్‌ హెలెన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో వనితా విజయ్ పై సానుభూతి చూపే ప్రయత్నం చేసింది దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్‌.  వనిత చాలా క‌ష్టాల్లో ఉన్నార‌ని, ఈ బంధం అయినా ఆమె నిలుపుకుంటారని ఆకాంక్షిస్తున్నట్టు ట్విట్ చేసింది. అయితే ద‌ర్శ‌కురాలి ట్వీట్‌పై వనిత విజయ్‌ కుమార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భార్యాభ‌ర్త‌లు  విడాకులు ఎందుకు తీసుకుంటున్నారో మీకు తెలుసా?  తెలియని విషయంపై ఆసక్తి చూపించాల్సిన అవసరం మీకు లేదు. మీరు ఈ విషయంలో తలదూర్చటం ఆపేయాలి అన్నారు.