దారుణం : ఆరేళ్ల పాపను గొంతుకోసి చంపేశాడు

మేడ్చల్ లో దారుణం జరిగింది. పోచారంలో ఆరేళ్ల పాపని గొంతుకోసి చంపేశాడు ఓ కిరాతకుడు. దల్లిదండ్రులపై కోపంతో వారి కూతురిని దారుణంగా చంపేశాడు.

కల్యాణ్, అనూష దంపతులు ఇస్మాయిల్‌గూడ విహారి హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల కూతురుంది. ఆ చిన్నారి పేరు ఆద్య. కల్యాణ్ దంపతులపై కరుణాకర్ అనే వ్యక్తి కక్ష పెంచుకున్నాడు. వారిపై ఉన్న కోపంతో చిన్నారి ఆద్యను చంపేశాడు. సర్జికల్‌ కత్తితో గొంతుకోసి హతమార్చాడు.