మరో పదేళ్లు మోడీనే ప్రధాని


2030 వరకు ప్రధానిగా మోదీయే కొనసాగుతారని అన్నారు  భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌  ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాలతో భాజపా జన సంవాద్‌ వర్చువల్‌ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అవినీతి, అసమర్థ పాలన కొనసాగుతోంది. కరోనా బారిన పడుతున్న ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తారు. సగం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు తప్పా చూపించడానికి కేసీఆర్‌కు మరేమీ లేదని రామ్‌మాధవ్‌ ఎద్దేవా చేశారు. అదే సమయంలో ప్రధాని మోడీ పాలనని ఆకాశానికి ఎత్తేశాడు.

మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే దేశ సమగ్రత, మహిళల హక్కులు, రైతుల అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తెచ్చారు. 70 ఏళ్లలో సాధ్యం కాని ఆర్టికల్‌ 370ని 70 గంటల్లో రద్దు చేసిన ఘనత ఆయనది. 2030 వరకు ప్రధానిగా మోదీయే కొనసాగుతారని చెప్పుకొచ్చారు.