TSలో 1831 కొత్త కేసులు.. 11 మంది మృతి !

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1831 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1419 కేసులు నమోదయ్యాయ్. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 25733కి చేరింది.

ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 11 మంది చనిపోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 306కి చేరింది. సోమవారం 2078 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14781కి చేరింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి హైదరాబాద్ ని లాక్‌డౌన్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే హైదరాబాద్ లాక్‌డౌన్ విషయంలో ప్రభుత్వం సమాలోచనలకే పరిమితం అవుతుంది. ఏ నిర్ణయం తీసుకోవడం లేదు.