కేసీఆర్’కు కరోనా.. తప్పుడు ప్రచారం చేసిన విలేకరి అరెస్ట్ !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇటీవల హరితహారం కార్యక్రమంలోనే పాల్గొనడం వలనే కేసీఆర్ కు కరోనా సోకి ఉంటుంది. సీఎం కేసీఆర్ కి మాత్రమే కాదు.. ప్రగతి భవన్ లో దాదాపు 30 మంది వరకు కరోనా సోకిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారం మొదలెట్టింది మాత్రం ‘ఆదాబ్ హైదరాబాద్ పత్రిక’.
 
తాజాగా సీఎం కేసీఆర్ కు కరోనా అంటూ రాసిన విలేకరి వెంకటేశ్వరరావుతో పాటు, పత్రిక యాజమాన్యంపై జూబ్లీహీల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఓ తెరాస కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేఖరి వెంకటేశ్వరరావుతో పాటు యాజమాన్యంపై ఐపీసీ 505(1)(b), 505(2) రెడ్ విత్34 సెక్టన్లతో పాటు 54 ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.