కరోనాని జయించిన బండ్ల గణేష్

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కరోనా నుంచి కోలుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా బండ్ల గణేష్ తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి ఈటెల రాజేందర్ కు కృతజ్జతలు తెలిపారు.

“ఆ రాత్రి మాకు ఫోన్ చేసి మాట్లాడి నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. 24 గంటలు పనిచేస్తున్న ఆరోగ్య మంత్రి గారికి ధన్యవాదములు. నా ప్రాణం కాపాడిన దేవుడు ఈటల రాజేందర్ గారు” అంటూ ట్విట్ చేశారు బండ్ల.