సుమలతకు కరోనా పాజిటివ్

సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కరోనా బారినపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నటి, మాండ్యా నియోజకవర్గ ఎంపీ సుమలతకు కరోనా బారినపడ్డారు. శనివారం సుమలతకు తలనొప్పి, గొంతు నొప్పి రావడంతో అనుమానం వచ్చి.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దానికి సంబంధించి రిపోర్ట్ ఈరోజు వచ్చింది. కరోనా పాజిటివ్ గా వచ్చింది. దీంతో సుమలతతో పాటు ఆమె కుటుంబ సభ్యులు హోం క్వారైంటైన్ లోకి వెళ్లిపోయారు.

ఇటీవల ఎంపీ సుమలత తన నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది. సుమలతకి కరోనా పాజిటివ్ అని తెలిసి.. ఆమె అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే దేవుని దయతో త్వరగానే కరోనా నుంచి కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు సుమలత.