ఆ రాష్ట్రంలో కరోనా కేసులు సున్నా

హిమాచల్ ప్రదేశ్ త్వరలోనే కరోనా ఫ్రీ రాష్ట్రంగా అవతరించనుంది. అక్కడ కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటివరకు 1,046 మంది వైరస్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం 326 యాక్టివ్‌ కేసులు ఉండగా 9 మంది మృతిచెందినట్లు ఆదివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కరోనా కంట్రోల్ కి వస్తున్న నేపథ్యంలో ఈ నెలలోనే స్కూల్స్ ని రీ ఓపెన్ చేయాలని హిమాచల్ ప్రదేష్ ప్రభుత్వం భావిస్తోంది. ఇక
  దేశంలో ఇప్పటివరకు 6.73 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 4.1 లక్షల మంది కోలుకోగా 773 మంది వైరస్‌తో మృతిచెందారు.