దేశంలో 22,752 కొత్త కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,752 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్. మరో 482 మంది కరోనాతో మృతి చెందారు. ఇక దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 7,42,417కి చేరింది. మరణాల సంఖ్య 20,642కి చేరింది. గత వారంరోజుల్లోనే దేశంలో లక్షా 60వేల కేసులు, 3242 మరణాలు సంభవించాయి.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్నవారి సంఖ్య ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 61.13శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 4,56,831 మంది కోలుకోగా మరో 2,64,944 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.