ఇడుపులపాయలో సీఎం జగన్.. మహానేతకు నివాళి !

మహానేత వైఎస్ 71వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబం ఇడుపుల పాయకు వెళ్లింది. అక్కడ వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. సీఎం జగన్, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లెలు షర్మిల, మంత్రులు షేర్ని నాని, ఆదిమూలపు సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్ఆర్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్ఆర్ మంచి మనసుని కీర్తించారు. ఆయన కుటుంబానికి ప్రభువు ఆశీర్వాదం ఉండాలని కోరారు. ఇక వైఎస్ ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర పథకాలు మంచి ఫలితాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎం జగన్ కూడా తండ్రికి తగ్గ తనయుడుగా సంక్షేమపథకాలని అమలు చేస్తున్నారు. మంచి సీఎం అనిపిచుకొంటున్నారు.