గుడ్ న్యూస్ : ఇకపై ‘ఎంసీఏ’ రెండేళ్లే !

ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్) చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. మూడేళ్ల ఎంసీఏ కోర్సుని రెండేళ్లకి కుదిస్తూ.. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యూకేషన్ (ఎఐసిటిఇ) ప్రకటించింది. ఈ విద్యా సంత్సవరం (2020-2021) నుంచే ఎంసీఏ ని రెండేళ్ల కోర్సుగా మారనుంది అన్నమాట.

యూసీజీ తీసుకున్న నిర్ణయం, ఐఎసిటీఇ అప్రూవ్డ్ ప్రాసెస్ హ్యాండ్ బుక్ లో పొందుపరిచిన నింబంధనలకి అనుగుణంగా రెండేళ్ల ఎంసీఏ కోర్సు కాల వ్యవధి అనుగుణంగా తగిన సవరణలు చేపట్టాలని అధికారిక ఉత్తర్వులో ఐఎసిటిఇ పేర్కొంది. చాన్నాళ్ల నుంచి ఎంసీఏని రెండేళ్లకి కుదించాలనే డిమాండ్ ఉంది.