గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌ దూబే అనుచరుడు ఎన్‌కౌంటర్

గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌ దూబే ప్రధాన సహాయకుడు అమర్‌ దూబేని యూఫీ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. గత గురువారం కాన్పూర్ లో 8 మంది పోలీసులను చంపిన వికాస్‌ దూబే ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. వీరికోసం మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 100కుపైగా స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు గాలిస్తున్నాయి.

ఈ క్రమంలో ఈ ఉదయం హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో అమర్‌ దూబేను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. కాన్పూర్‌ ఘటనలో ప్రధాన నిందితుల్లో ఒకరైన అమర్‌ దూబే బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని ఉత్తరప్రదేశ్‌ అదనపు డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.