ఎల్‌జీ పాలిమర్స్ కేసు.. 12మంది అరెస్ట్ !

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో పదుల సంఖ్యలో మృతి చెందగా.. వందల సంఖ్యలో అస్వస్థతకి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థకు చెందిన 12 మందిని విశాఖ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 విషవాయువు ఘటనకు పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ హైపవర్‌ కమిటీ సీఎం జగన్‌కు నివేదిక సమర్పించిన మరుసటిరోజే ఈ అరెస్టులు చోటుచేసుకోవడం గమనార్హం. ఆ సంస్థ సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు సహా మొత్తం 12 మందిని అరెస్ట్‌ చేసినట్లు విశాఖ పోలీసు కమిషనర్‌ ఆర్‌కే మీనా వెల్లడించారు.