ఒక్కరోజే 25వేల కొత్త కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 24,879పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 7,67,296కు చేరింది. కరోనాతో నిన్న ఒక్కరోజే 487మంది మృత్యవాతపడ్డారు. దీంతో దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 21,129కి చేరింది.

ఇప్పటి వరకు కరోనా నుంచి 4,76,378 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,69,789మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 62గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీలలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది.