ధోని అభిమానులకి గుడ్ న్యూస్

మహేంద్ర సింగ్ ధోని అభిమానులకి గుడ్ న్యూస్. ధోని మళ్లీ భారత జట్టులో తన సత్తా చూపించాలనే ఆశతో ఉన్నారు. దానికంటే ముందు ఐపీఎల్ లో రాణించాలి. భారతజట్టులో స్థానం సంపాదించాలి. ఆ తర్వాత పాత ధోనిని చూపించాలి. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఈ యేడాది ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు ఏర్పడ్డాయి. వాటిని తొలగిస్తూ.. బీసీసీఐ బాస్ గంగూలీ బుధవారం బర్త్ డే గిఫ్ అందించారు. ఐపీఎల్ లేకుండా ఈ యేడాది ముగియదని ప్రకటించారు. దీంతో ధోని అభిమానులు ఖుషి అవుతున్నారు.

ఐపీఎల్ జరిగితే.. ధోని భారత జట్టులోకి రీ-ఎంట్రీ ఖాయమని ఆశపడుతున్నారు. అంతేకాదు.. ధోని రిటైర్మెంట్ ఇప్పట్లో ఉండదని ధోని మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. మహీకి ఇప్పుడప్పుడే రిటైర్మెంట్‌ ఆలోచనలు లేవని.. ధోనీ మేనేజర్‌ మిహిర్‌ దివాకర్‌ అన్నారు. 
‘మేమిద్దరం స్నేహితులుగా ఉన్నాం కాబట్టి తన క్రికెట్‌ గురించి మాట్లాడుకోం. కానీ, ధోనీని చాలా దగ్గరగా చూశాను కాబట్టి ఒక విషయం చెబుతున్నా.. తనకి రిటైర్మెంట్‌పై ఇప్పుడే ఎటువంటి ఆలోచనలు లేవు. ఐపీఎల్‌ ఆడాలని ఎంతో ఆశగా ఉన్నాడు. అందుకోసం ఎంతో కష్టపడ్డాడు. లాక్‌డౌన్‌ కంటే ఒక నెల ముందే చెన్నైలో సాధన మొదలుపెట్టాడు’నని చెప్పుకొచ్చాడు.