నిమ్స్ లో ఓపీ సేవలు బంద్

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఓపీ సేవలకి బ్రేక్ పడింది. కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది ధర్నాకు దిగడంతో వైద్య సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. నిమ్స్‌లో వివిధ విభాగాల వద్ద రోగులు గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు.

తెల్లవారుజాము నుంచి డయాలసిస్‌ రోగులు క్యూలో నిలబడ్డారు. ఈ క్రమంలో రోగులంతా భౌతిక దూరం లేకుండా గుమికూడారు. వైద్యులు కూడా ఆలస్యంగా రావడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. అసలే కరోనా విజృంభిస్తున్న సమయంలో నిమ్స్ లో ఓపీ సేవలు బంద్ కావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.