రాజమౌళి కరోనా టైమ్ మహేష్ కోసం వినియోగిస్తున్నారా !

దర్శకధీరుడు రాజమౌళి ఓ సినిమా పూర్తయిన తర్వాతే.. మరో సినిమాపై పోకస్ పెడతారు. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. దాదాపు 80శాతం షూటింగ్ పూర్తయింది. కరోనా ఎఫెక్ట్ తో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ తో ఓ సినిమా చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ ఈ సినిమాని నిర్మించనున్నారు. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో ఇంటికే పరిమితమైన జక్కన్న మహేశ్ కథపై కూర్చున్నట్టు సమాచారమ్.

తండ్రి విజేంద్ర ప్రసాద్ తో కలిసి మహేష్ కోసం అనుకున్న లైన్ కి స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పట్లో కరోనా ప్రభావం తగ్గేలా లేదు. తగ్గిన వెంటనే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి.. ఆ వెంటనే మహేష్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేలా స్క్రిప్ట్ పనులని పూర్తి చేస్తున్నారంట రాజమౌళి. రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ పూర్తి చేసేలోపు మహేష్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాని పూర్తి చేయనున్నారు.

ఇక మహేశ్ కోసం రాజమౌళి జేమ్స్ బాండ్ తరహా కథని రెడీ చేస్తున్నారని.. కాదు చారిత్రక నేపథ్యం ఉన్న కథని రెడీ చేస్తున్నారనే ప్రచారం ఉంది. ప్రభాస్ కు ఛత్రపతి, బాహుబలి సినిమాలతో, రామ్ చరణ్ కు మగధీర, ఆర్ ఆర్ ఆర్, తారక్ కి స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు జక్కన్న. వీటిని మించేలా మహేశ్ తో రాజమౌళి  సినిమా ఉండబోతుందని సమాచారమ్.