ఫాంహౌస్’లో కేసీఆర్.. తప్పేంటీ ?

తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయ్. అయితే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయ్. అసలు ఫాంహౌస్’లో ఉండే సీఎం కేసీఆర్ కు సచివాలయాన్ని కూల్చే అర్హత లేదని తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు అయితే ఏకంగా సెక్షన్ 8ని తెరపైకి తీసుకొస్తున్నారు. సచివాలయం కూల్చివేతకు గవర్నర్ అనుమతి తీసుకున్నారా ? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో  సీఎం కేసీఆర్‌, కరోనా, సచివాలయం కూల్చివేత అంశాలపై తాజా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా నిలిచిపోయాయా? రాష్ట్ర గౌరవానికి తగినట్లు సచివాలయం ఉంటే తప్పా? భవిష్యత్‌లో ఇంకా చాలా మందికి కరోనా సోకుతుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడి నుంచైనా పరిపాలన చేసే సౌలభ్యం మనకు ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆన్‌లైన్‌లో సమీక్షలు జరపట్లేదా అని తలసాని ప్రశ్నించారు.