TSలో 1410 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో తెలంగాణలో 1410 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,946కి చేరింది. మరణాల సంఖ్య 331కి చేరింది.

ఇప్పటి వరకు మొత్తం 18,192 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 12,423 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 918 కేసులు నమోదయ్యాయ్. రంగారెడ్డి పరిధిలో 125, మేడ్చల్‌లో 67, సంగారెడ్డిలో 79 మంది కరోనా బారినపడ్డారు.