దేశంలో 26,506 కొత్త కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయ్. గడిచిన 24 గంటల్లో దేశంలో 26,506 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 475 మంది కరోనాతో మృతిచెందారు.

దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,93,802కు చేరింది. మృతుల సంఖ్య 21,604కు చేదింది. ఇప్పటి వరకు కరోనా నుంచి  కోలుకొని 4,95,513 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,76,685 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ లలో కరోనా ప్రభావం అధికంగా ఉంది.