కేసీఆర్’కు కరోనా పిటిషన్.. హైకోర్ట్ స్ట్రాంగ్ వార్నింగ్ !


సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇవ్వాలంటే హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈ పిటిషన్ వేశారు. సీఎం కేసీఆర్ కనబడటం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ కు కరోనా అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ ఇవ్వాలని తీన్మార్ మల్లన్న హైకోర్టుని ఆదేశించారు.

ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను విచారించలేమంటూ తేల్చి చెప్పింది. పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఊరుకునేది లేదని పిటిషనర్‌ను హెచ్చరించింది. ముఖ్యమంత్రి కనిపించకపోతే హెబియస్ కార్ప్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించలేమని స్పష్టం చేసింది.