ఒక్కరోజే 22,123 మంది డిశ్ఛార్జ్

దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా ప్రతిరోజూ 25వేలకి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయ్. అయితే అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఊరటని కలిగించే విషయం. దేశంలో గత 24 గంటల్లో 27,114 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య  8,20,916కు చేరుకుంది.

గత 24 గంటల్లో 22,123 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య  5,15,386కి చేరింది. కరోనా రికవరీ రేటు 62.7 శాతానికి పెరిగింది. 2,38,461 కేసులున్న మహారాష్ట్రలో 1,32,625 మంది మెరుగయ్యారు. చికిత్స పొందుతున్నది 95,943 మందే. తమిళనాడులో 1,30,261 కేసులు నమోదవ్వగా 82,324 మంది వైరస్‌పై విజయం సాధించారు. అక్కడ 46,108 మందే చికిత్స పొందుతున్నారు.