‘ఆర్ఆర్ఆర్’కు షాక్ ఇస్తున్న బయ్యర్లు

బాహుబలి తీసిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తీస్తున్నాడు అంటే.. ఆ అంచనాలు మాములుగా ఉండవ్. రాజమౌళి కూడా తన గత సినిమాలకు దీటుగా ఆర్ ఆర్ ఆర్ మార్కెట్ చేయాలని భావించారు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైంది. నిర్మాత ఎంత చెబితే అంతకు బయ్యర్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు.  కరోనా ప్రభావం లేనప్పుడు జరిగిన అగ్రిమెంట్స్ అవి.

ఇప్పుడు కరోనా ప్రభావంతో బయ్యర్లు తలలు పట్టుకుంటున్నారు. థియేటర్స్ ఎప్పుడు తెరచుకుంటాయ్. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఒకవేళ రిలీజైన ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా ? అన్న ఆలోచనలతో భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ డబ్బులని తిరిగి ఇవ్వాలని నిర్మాత డివివి దానయ్యని రిక్వెస్ట్ చేస్తున్నారట. ఇది ఆర్ ఆర్ ఆర్ చిత్రబృందానికి కొత్త సమస్యగా మారింది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథాయకులుగా ‘ఆర్ఆర్ఆర్’. తెరకెక్కుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన తారక్, చరణ్ లకి గురువు పాత్రలో కనిపిస్తారనే ప్రచారం ఉంది. అజయ్ దేవగణ్ కి జంటగా శ్రియ నటిస్తోంది. ఇక తారక్ కి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్, చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 400కోట్లతో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది జనవరి 8న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా దెబ్బతో ఆ డేటుకి రావడం కష్టమే అంటున్నారు.