నిర్మాతగా ప్రభాస్ సోదరి

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ రాణిస్తున్నారు. బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు. కృష్ణంరాజు పెద్ద  కుమారై  ప్రసీధ నిర్మాత సినీ పరిశ్రమలోకి అంగేట్రం చేస్తోంది.

ప్రభాస్‌ 20వ చిత్రం ‘రాధేశ్యామ్’ నిర్మాతల్లో వంశీ, ప్రమోద్‌తోపాటు ప్రసీధ కూడా ఉంది. తన సోదరుడు ప్రభాస్‌తో నిర్మాణరంగంలో పనిచేస్తూనే..మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ప్రవేశించే ఆలోచన కూడా చేస్తుందట ప్రసీధ. తన సోదరి నిర్మాతగా నిలదొక్కుకునేందుకు ప్రభాస్ సహకారాన్ని అందించబోతున్నట్టు తెలుస్తోంది.