‘రెడ్’ 30కోట్ల ఆఫర్

ఎనర్జిటిక్ హీరో రామ్ తాజా చిత్రం ‘రెడ్’. తమిళ్‌ సూపర్ హిట్ ‘తడమ్’ రిమేక్ ఇది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ కథానాయికలు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి తర్వాత రామ్‌-కిశోర్‌ తిరుమల కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన రెడ్ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది.

రెడ్ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది అంటూ గతంలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదు. ఎంత లేటైనా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని స్వయంగా రామ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో రెడ్ ఓటీటీ రిలీజ్ ప్రచారానికి తెరపడింది. లెటెస్ట్ న్యూస్ ఏటంటే ? రెడ్ చిత్రానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్టు సమాచారమ్. ఏకంగా రూ. 30కోట్లు ఆఫర్ చేశారట. అయితే ఈ ఆఫర్ రామ్ రిజెక్ట్ చేసినట్టు సమాచారమ్.