TSలో 1,269 కొత్త కేసులు


తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,269 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది కరోనాతో మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ నుంచి 800 కేసులు రాగా, రంగారెడ్డి జిల్లా నుంచి 132, మేడ్చల్‌ నుంచి 94 కేసులు నమోదయ్యాయి.

ఆదివారం 1,563 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్ అయ్యారు. దీంతో  ఇప్పటివరకు 22, 482 మంది డిశ్ఛార్జి అయ్యారు. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,671కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 356కి చేరింది. అయితే కొత్తగా నమోదైన కేసుల సంఖ్య కంటే డిశ్చార్జ్ అవుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.