ఐశ్వర్యారాయ్, ఆమె కూతురుకి కూడా కరోనా !


బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా కోరల్లో చిక్కుకుంది. శనివారం అమితాబ్ కు ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఐశ్వర్యారాయ్, ఆమె కూతురు ఆరాధ్య కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో బిగ్ బీ ఫ్యామిలీ మొత్తం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఒక్క జయా బచ్చన్ మాత్రం హో క్వారంటైన్ అయ్యారు.

శనివారం మూత్రపిండాల నొప్పితో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు అమితాబ్. ఆయనకి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో.. గత 10 రోజుల క్రితం నుంచి తనని కలిసిన వాళ్లు కరోనా టెస్టులు చేయించుకోవాలని బిగ్ బీ ట్విట్ చేశారు. ఇక శనివారం అర్థరాత్రి తనకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని అభిషేక్ ట్విట్ చేశారు. ఆదివారం ఉదయం ఐశ్వర్యారాయ్, ఆమె కూతురుకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. అమితాబ్ ఫ్యామిలీ మొత్తం కరోనా బారినపడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.