TSలో 1,550 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,550 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 9మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,221కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 365కి చేరింది.

కొత్తగా కరోనా నుంచి కోలుకొని 1,197 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్ అయినవారి సంఖ్య 23,679కి చేరింది. ప్రస్తుతం 12,178 మంది వైద్యం పొందుతున్నారు. ఇక సోమవారం కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ నుంచి 926 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి 212, మేడ్చల్‌ నుంచి 53 కేసులు వచ్చాయి.