భారత్ లో 23వేలు దాటిన కరోనా మరణాలు

భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 28,701 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో ఇప్పటి వరకు ఇదే అధికం. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,78,254కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 500మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 23,174గా నమోదైనట్లు కేంద్రం తెలిపింది.

నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 18,850 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,53,471 మంది కోలుకోగా మరో 3,01,609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 62.5శాతంగా ఉంది. ఇక ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ మూడోస్థానంలో కొనసాగుతుండగా, కొవిడ్ మరణాల్లో మాత్రం ఎనిమిదో స్థానంలో ఉంది.