ఏపీ కరోనా రిపోర్ట్ : ఒక్కరోజే 37 మంది మృతి

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కరోనా కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 1935 కరోనా కేసులు నమోదయ్యాయ్. మరో 37 మంది మరణించారు. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,103కి చేరింది. వీరిలో కరోనా నుంచి 16,464 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 365 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 14,274 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

ఈరోజు కరోనాతో మృతి చెందిన 34 మందిలో..  అనంతపూర్‌లో ఆరుగురు, కర్నూలులో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, విశాఖపట్టణంలో ఒకరు, విజయనగరంలో ఒకరు చనిపోయారు.