అమితాబ్ సిబ్బందిలో ఎంతమందికి కరోనా వచ్చిందో తెలుసా ?

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ కుటుంబం కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అమితాబ్ తో పాటు ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్. మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వీరి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమితాబ్ భార్య జయా బచ్చన్ కి మాత్రం కరోనా నెగటివ్ వచ్చింది.

అమితాబ్ కి కరోనా పాజిటివ్ రావడంతో.. ఆయన సిబ్బంది, ఇటీవల ఆయన్ని కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. అయితే అమితాబ్ కుటుంబానికి చెందిన 26 మంది వ్యక్తిగత సిబ్బందికి కరోనా టెస్టులు చేయగా.. వారికి నెగటివ్ వచ్చినట్టు సమాచారమ్. ఇక అమితాబ్ ఫ్యామిలీ కరోనా బారినపడటంతో వారికి సంబంధించిన నాలుగు బంగ్లాలు జ‌ల్సా, జ‌న‌క్‌, ప్ర‌తీక్ష‌, వ‌స్తాల‌ని సీల్ చేసి శానిటైజ్ చేశారు.