మరో టీవీ నడుడుకి కరోనా

తెలుగు టీవీ సీరియల్స్ షూటింగ్స్ జరుపుకుంటున్నాయ్. ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ పాటిస్తూ షూటింగ్స్ కానిచ్చేస్తున్నారు. అయితే బుల్లితెర నటీనటులు వరుసగా కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్ప‌టికే నవ్య స్వామి, రవికృష్ణ, ఝాన్సీ, సాక్షి శివ, ప్రభాకర్ తదితరులు కరోనా బారినపడ్డారు.

తాజాగా టీవీ నటుడు భరద్వాజ్ రంగావిజ్జుల కరోనా బారిన పడ్డాడు. స్వాతిచినుకులు, బంధం అనే టీవీ సీరియ‌ల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న భ‌ర‌ద్వాజ్ క‌రోనా బారిన ప‌డ్డ‌ట్టు త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. క‌రోనా ల‌క్ష‌ణాలు త‌న‌కి లేవ‌ని, మంచి డైట్‌తో పాటు మందులు వాడితే ఈ మ‌హ‌మ్మారిని నుండి బ‌య‌ట‌ప‌డొచ్చ‌ని చెప్పుకొచ్చాడు. ఇటీవల తనని కలిసివారు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. జాగ్రత్తగా ఉండాలి సూచించారు.