బాలీవుడ్ నటి దివ్యా చౌక్సీ కన్నుమూత

బాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటి, 2011 మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ దివ్యా చౌక్సీ (30) కన్నుమూశారు. ఆమె చాన్నాళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. చనిపోయే గంట ముందు దివ్య తన ఇన్‌స్టాలో ఓ స్టోరీని పోస్ట్ చేశారు.

‘నేను చెప్పాలనుకున్న విషయాన్ని తెలపడానికి మాటలు రావడం లేదు. గత కొన్ని నెలలుగా నేను మెసేజ్‌లకు దూరంగా ఉంటున్నా. మీకు చెప్పేందుకు ఇదే సరైన సమయం. నేను నా డెత్‌ బెడ్ మీద ఉన్నా. ఏమైనా జరగొచ్చు. అయినా నేను స్ట్రాంగ్‌గా ఉన్నా. మరో జన్మ ఉంటే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటున్నా. నన్ను ఏం ప్రశ్నించకండి ప్లీజ్. మీరంటే నాకు ఎంత ఇష్టమే కేవలం దేవుడికి మాత్రమే తెలుసు’ అని పోస్ట్ చేసింది. ఆమె ఆఖరి పోస్టు అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తోంది.

ఈ యేడాది బాలీవుడ్ లో వరుస విషాద వార్తలు వినిపిస్తున్నాయి.  ఏడాదిలో బాలీవుడ్‌కు చెందిన నటులు రిషికపూర్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, సరోజ్‌ ఖాన్‌, వాజీద్‌ ఖాన్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యని బాలీవుడ్ ఇంకా జీర్ణించుకోలేదు. ఇంతలో ఆదివారం యువ నటుడు రంజన్ సెహగల్ మృతి చెందారు. ఆ విషాద వార్త విని 24గంటలు గడవక ముందే నటి దివ్య చౌక్సే మరణవార్త వినాల్సి వచ్చింది.